మంత్రి గంటాకు షోకాజ్ నోటీస్..!!

 

 

 

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. త్వరలో ఆయన షోకాజ్ నోటీసులు ఇవ్వనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైందని, విభజనపై తీవ్రంగా విమర్శలు చేస్తుండడంతో గంటాపై హైకమాండ్ మడిపడుతోంది. రెండు, మూడు రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించినట్లు తెలియవచ్చింది. గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిలో ఉన్న నేపథ్యంలో షోకాజ్ నోటీసులు పీసీసీ ఇవ్వాలా, లేక ఏఐసీసీ ఇవ్వాలా అన్నదానిపై అధిష్టానం సోమవారం నిర్ణయం తీసుకోనుంది. కాగా గంటా తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తనకు వచ్చిన షోకాజ్ నోటీస్‌పై శుక్రవారం వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తి వివరణ ఇస్తాని పీసీసీకి తెలిపుతూ వివరణ ఇచ్చారు.