శోభా నాగిరెడ్డి మృతదేహం ఆళ్ళగడ్డకి తరలింపు

 

రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నాయకురాలు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతదేహం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి నుంచి ఆళ్ళగడ్డకి తరలించారు. కేర్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ లో తరలించారు. అంబులెన్స్ వెనుక శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, వైసీపీ నాయకులు వాహనాల్లో అనుసరిస్తున్నారు. శుక్రవారం నాడు ఆళ్ళగడ్డలో భూమా శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.