వైకాపా నేత శోభా నాగిరెడ్డి కన్నుమూత

posted on: Apr 24, 2014 12:54PM

 

 

 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా... గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట నంద్యాలలో ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స నిర్వహించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకొనివచ్చారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఆమె ఉదయం 11.05గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...