మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తా.. కన్నయ్యకు అవకాశం ఇచ్చారు

 

శివసేనకు వివాదాస్పద  వ్యాఖ్యలు చేయడం కొత్తేమికాదు. అందునా మోడీ మీద... మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఏదో ఒక రకంగా కామెంట్లు విసురుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తనదైన శైలిలో విమర్శలు చేసే శివసేన మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తనపై విమానంలో దాడి చేశారన్న నేపథ్యంలో కన్నయ్య కుమార్ మోడీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించి.. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ లాంటి చోటా నేతలకు కూడా విమర్శలు చేసే అవకాశం కల్పించారని అన్నారు.  విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, ఎన్నికలకు ముందు మోడీ చాలా హామీలే గుప్పించారు.. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు' అని బిజెపి మిత్రపక్షమైన శివసేన విమర్శించింది.