నౌక ముగిని 405 మంది గల్లంతు

posted on: Jun 2, 2015 2:53PM

చైనాలో తుఫాన్ కారణంగా ఓ నౌక అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 450 మంది జలమయం అయ్యారు. వివరాల ప్రకారం ఈస్టెన్ స్టార్ అనే నౌక చైనాలోని అతి పొడవైన నదిగా పేరొందిన యాంగ్జీ నది మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారిగా విపరీతమైన గాలులు, తుఫానుతో ప్రతికూల వాతవరణం ఏర్పడి నౌక నదిలో మునిగి పోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే నౌకలో మొత్తం 405 మంది ప్రయాణికులు, 47 మంది సిబ్బంది ఉండగా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగారు. తుఫాన్ వల్ల సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందని, గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...