వారసుడిని కనలేదని భార్యకు, పిల్లలకు నిప్పటించిన రాక్షసుడు

కుమారుడిని కనలేదని తన వంశానికి వారసుడిని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్యను, ముగ్గురు ఆడపిల్లలని సజీవదహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కాండి అనే గ్రామంలో ఉస్తాఖ్, నజీఫాలు భార్య భర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఈ నేపథ్యంలో ఉస్తాఖ్ తనకు వారసుడిని ఇవ్వలేదని తరుచుగా తన భార్యతో గొడవపడేవాడు. ఆ కోపంతో ఆ కర్కోటకుడు తన భార్యను, ముగ్గురు పిల్లలను ఇంట్లోకి నెట్టి ఇంటికి నిప్పటించాడు. వారు ఆ మంటలలో కేకలు పెడుతూ సజీవదహనం అయ్యారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.