Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వారసుడిని కనలేదని భార్యకు, పిల్లలకు నిప్పటించిన రాక్షసుడు
posted on: Jun 1, 2015 11:50AM

కుమారుడిని కనలేదని తన వంశానికి వారసుడిని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్యను, ముగ్గురు ఆడపిల్లలని సజీవదహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కాండి అనే గ్రామంలో ఉస్తాఖ్, నజీఫాలు భార్య భర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఈ నేపథ్యంలో ఉస్తాఖ్ తనకు వారసుడిని ఇవ్వలేదని తరుచుగా తన భార్యతో గొడవపడేవాడు. ఆ కోపంతో ఆ కర్కోటకుడు తన భార్యను, ముగ్గురు పిల్లలను ఇంట్లోకి నెట్టి ఇంటికి నిప్పటించాడు. వారు ఆ మంటలలో కేకలు పెడుతూ సజీవదహనం అయ్యారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


.jpg)



