Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మూత్రం చికిత్సతో ఆరోగ్యం!!
posted on: Jul 5, 2022 9:30AM
మన ఆరోగ్యానికి సంబందించిన ఔషదాలలో మూత్రం ఒకటి. మూత్రం తో చికిత్చ చిచి అని అంటున్నారు కదా. మీరు అవునన్నా కాదన్నా మూత్రం తో చికిత్చ ఉందని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. మనకు అనారోగ్యం వస్తే ఎక్కడి కైనా వెళ్లి మందు తెచ్చు కుంటాము.ఆ మందు వేసుకున్నాకే రోగం తగ్గిందని భావిస్తాము.లేదా కొన్ని సందర్భాలలో ఆ మందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.
ఖచ్చితంగా మనశరీర తత్వానికి సరిపడుతుందా అన్నదే ప్రశ్న?
అయితే మన ఆరోగ్యానికి శరీరానికి ఖచ్చితంగా సరిపడే మందు మనశరీరం లోనే ఉంది అని అంటున్నారు నాడి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. దానినే మూత్ర చికిత్చ.చిచి ఇదేం చికిత్చ అని మాత్రం అనుకోకండి సుమా ఇది అక్షరాలా నిజం.మన పూర్వీకులు మనకు అందించిన చికిత్చ గా ఏర్కొన్నారు.కృష్ణం రాజు.మన శరీరంలో జరిగే ప్రక్రియ ప్రకారం మనం నిద్రపోయే సమయం లో విష పదార్ధాలు వ్యర్ధ పదార్ధాలు కణాలతో పోరాడి వాటిని తొలగిస్తుంది.అలాగే ప్రత్యేక అవసరాలకు సరైన ఔషదాన్ని తయారు చేసుకుంటుంది.అదే మనకు అధిక మోతాదులో ఉదయం లేవగానే పోసే మూత్రం లో ఉంటుంది.ఈ రకం గా ఉదయాన్నే మొదటి సారి విడుదల అయ్యే మూత్రాన్ని తాగడం ద్వారా మనశరీరం యొక్క అవసరాలు,లవణాలు,వగైరా లభిస్తాయని ఇదే మూత్ర చికిత్చ యొక్క మూల సిద్దాంతం గా పేర్కొన్నారు.దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
మూత్ర చికిత్చకు మూలాధారం ఏమిటి?..
మూత్ర చికిత్చ గురించి శివపురాణం లో,మహాభారాతం లో బైబుల్ లోనూ మతగ్రంధాలలో ఈ మూత్రము జీవామృత మని వ్రాయ బడిందని అంటున్నారు.శివపురాణం లో దానిని మూత్రం తాగే విధానం చాలా బాగా తెల్పబదిందని కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇందుకు ఉదాహరణగా పూర్వాకాలం లో నేరస్తులు మూత్రం తాగడం వల్ల వారిని పోలీసులు తీవ్రంగా హింసించినా ఏమి అనిపించేది కాదు.అలా కొన్ని రోజులు ఏ ఆహారం తీసుకోకపోయినా వారు అలాగే దృడంగా ఆరోగ్యంగా ఉండగలిగే వారని అలాగే దీని ఆధారంగానే దీర్ఘకాలం ఉపవాసం ఉన్నా రంటే దానికి కారణం మూత్రం తాగడమే అని పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే తాగమని భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి సెలవిచ్చారని వారి మూత్రాన్ని వారే 4౦ ఏళ్ళు తాగారని కృష్ణం రాజు గుర్తుచేశారు. అలా మూత్రాన్ని తాగుతూ 1౦౦ సంవత్సరాలు తీసుకుంటూనే ఉన్నరన్న విషయం దేశప్రజలకు బహుశా గుర్తుండి ఉండవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే సేవించడం సెల్ఫ్ యురిన్ తాగడం మంచది అన్న అంశం పై యు ఎస్ ఏ కు చెందినా డాక్టర్ బీ బ్రైసు చార్టర్ రాసిన పుస్తకాలాలో ఈ అంశాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు.శాస్త్రీయం గా నిరూపితమైందని కృష్ణం రాజు వాడుతున్నారు.
స్వయం గా మూత్రాన్ని ఎలా వాడాలి?...
ఉదయం నిద్ర లేవగానే మొదటి సారి విడుదల చేసిన మూత్రం లో కొన్ని చుక్కలు పోనివ్వాలి. అప్పుడు ఒక శుభ్రంగా ఉన్న గ్లాసులోమూత్రాన్ని పట్టి త్రాగాలి.దీనిని ఇన్ టేక్ అప్లికేషన్ అని అంటారు దీనిని ఎక్స్ టర్నల్ అంటే పై పూతగా కూడా వాడచ్చుఅని అంటున్నారు కృష్ణం రాజు.ఇందుకు ఉదాహరణగా వాడవచ్చనిఅంటే ఎక్కడైనా రక్త శ్రావం అవుతున్నప్పుడు లేదా చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు,ఫేషియల్ అనేక సమస్యలకు సెల్ఫ్ యురిన్ స్వీయ మూత్రం వాడవచ్చని కృష్ణం రాజు విశ్లేషించారు.
అసలు మూత్రం సేవిస్తే వచ్చే ఫలితాలు...
ఎవరి మూత్రాని వారు తాగడం వల్ల ఆశ్చర్య కరమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. మీరు స్వీయ మూత్రం వినియోగించే ముందు ముందుగా దానిని దయ చేసి పరీక్షించాలని సూచించారు.ఎందుకంటే మనం వాడే మందుకు తినే తిండికి ఎక్కడైనా కాలుష్యం లేదావిష తుల్య మైతే ప్రామాదమని.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు ఇతర చికిత్సలకు మందులు వాడుతున్న వారు సెల్ఫ్ యురిన్ అంటే స్వీయ మూత్రం త్రగావద్దని అయితే పై పూత గా వాడవచ్చని వివరించారు.స్వీయ మూత్ర చికిత్చ వాడేందుకు ఎలాంటి ఖర్చులు,డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదని అయితే మూత్రాన్ని పరీక్షించిన తరువాత మాత్రమే ఉపయోగించాలని డాక్టర్ కృష్ణం రాజు సూచించారు. .






