సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది

posted on: May 5, 2014 6:03PM

 

 

 

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కి రెండు రోజుల ముందు ప్రచారాన్ని ఆపే సంప్రదాయం ప్రకారం సోమవారం నాలుగు గంటలకు పది అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగిసింది. సాయంత్రం ఆరుగంటలకు మిగతా 165 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్రలో ఈనెల ఏడో తేదీన 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 274 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది పోలీసులు కూడా శాంతిభద్రతలను కాపాడతారని ఆయన చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే ఆదుకోవడానికి మూడు వేల అదనపు ఈవీఎంలను కూడా సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...