Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత ముస్లింలకు సౌదీ గుడ్ న్యూస్..
posted on: Jun 12, 2017 12:50PM

భారత్ కు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలకు సౌదీ అరేబియా బంపరాఫర్ ఇచ్చింది. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాను సందర్శించేందుకు వారి పవిత్ర మాసమైన రంజాన్ నెలలో హజ్ యాత్రకు ముస్లింలు భారీ సంఖ్యలో వెళుతుంటారు. అయితే ఎప్పటిలాగ కాకుండా ఈసారి 1,70,025 మందికి అనుమతించింది సౌదీ. కాగా గతేడాది ఈ సంఖ్య 1,36,020గా ఉండగా.... తాజా కోటాలో 1.25 లక్షల సీట్లను భారత హజ్ కమిటీకి రిజర్వ్ చేయగా, మిగిలిన 45 వేల సీట్లను ప్రైవేటు టూర్ ఆపరేటర్లకు కేటాయించారు. దీంతో సౌదీ నిర్ణయంపై భారత ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


.jpg)



