యుపి మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి కన్నుమూత

posted on: Oct 6, 2012 3:36PM

Satyanarayana Reddy no more, Satyanarayana Reddy died, Satyanarayana Reddy dead, Satyanarayana Reddy death

 

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ జె.సత్యనారాయణరెడ్డి 86 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం అన్నారం గ్రామం. ఆయన 1978లో జనతా పార్టీ తరఫున, 1984లో తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990-93 మధ్య ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఒడిశా, బెంగాళ్ రాష్ట్రాలకు స్వల్పకాలం గవర్నర్‌గా సత్యనారాయణరెడ్డి సేవలందించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...