Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సత్యం కేసు తీర్పు: రామలింగరాజు దోషి
posted on: Apr 9, 2015 11:24AM

సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పు గురువారం నాడు వెలువరించింది. ఈ కేసులో రామలింగరాజు సహా మిగతా నిందితులపై నేరం రుజువైంది. రామలింగరాజును ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సత్యం సంస్థ మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు, ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆ సంస్థ ఆడిటర్స్ యస్. గోపాల కృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్ తదితరులను దోషులుగా కోర్టు పేర్కొంది. క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే తుది తీర్పు ప్రకటించవలసి ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన తీర్పు మూడుసార్లు వాయిదా వేశారు. ఈ కేసులో దోషులుగా నిరూపణ అయిన రామలింగరాజుతో సహా మిగతా ముద్దాయిలందరూ గురువారం నాడు కోర్టుకు హాజరయ్యారు.






