రామలింగరాజుకు ఏడేళ్ళ జైలు

posted on: Apr 9, 2015 3:04PM

 

సత్యం కుంభకోణంలో రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. నిందితులలో ఏ1 నుంచి ఏ10 వరకూ ఉన్న మొత్తం పది మందికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరికి రూ.25 లక్షల నుంచి 5 కోట్ల వరకు జరిమానా విధించింది. సత్యం రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, 5 కోట్లు జరిమానా పడింది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు గురువారం వెలువడనుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఢిల్లీనుంచి వచ్చిన మీడియాతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. కొంతమంది విదేశీ పాత్రికేయులు కూడా వచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...