Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రామలింగరాజుకు ఏడేళ్ళ జైలు
posted on: Apr 9, 2015 3:04PM

సత్యం కుంభకోణంలో రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. నిందితులలో ఏ1 నుంచి ఏ10 వరకూ ఉన్న మొత్తం పది మందికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరికి రూ.25 లక్షల నుంచి 5 కోట్ల వరకు జరిమానా విధించింది. సత్యం రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, 5 కోట్లు జరిమానా పడింది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు గురువారం వెలువడనుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఢిల్లీనుంచి వచ్చిన మీడియాతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. కొంతమంది విదేశీ పాత్రికేయులు కూడా వచ్చారు.






