వైఎస్ కుక్కచావు చచ్చారన్న సర్వే

 

Sarve Satyanarayana congress, Sarve Satyanarayana rajashekar reddy, rajashekar reddy accident

 

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి పై సర్వే సత్య నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా వైఎస్ కుక్కచావు చచ్చారు అని హీనంగా మాట్లాడారు. ప్రజాసేవ చేయమని సోనియాగాంధీ పంపితే ఆయన డబ్బు దోచుకున్నారని, అందుకే అలా చచ్చారని అన్నారు. సోనియాగాంధీ నియమిస్తేనే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారని, వైఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వేనని, అందులో వైఎస్ ఘనత ఏమీ లేదని అన్నారు. ఎంత వైఎస్ అంటే పడకున్నా సర్వే ఇలా మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు.