బాలీవుడ్ లో అడుగుపెడుతున్న శరణ్యామోహన్

posted on: Mar 17, 2013 12:18PM

 

 

Saranya Mohan heads to Bollywood, Bollywood Saranya Mohan

 

 

“భీమిలీ కబడ్డీ జట్టు”, “విలేజ్ లో వినాయకుడు” సినిమాల్లో.. చక్కని చుక్కలా తెలుగింటి వారిని ఆకట్టుకున్న కేరళ కుట్టి శరణ్యా మోహన్. ఈ మధ్య తెలుగులో అంతగా కనిపించకపోయే సరికి ఫేడ్ అవుట్ అయిపోయిందేమో అని అంతా అనుకున్నారు. కానీ, అందరికీ షాక్ నిస్తూ... ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. ఇంతకూ విషయం ఏమిటంటే... “భీమిలీ కబడ్డీ జట్టు” సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక విషయం వచ్చేసరికి ... తెలుగు, తమిళ వర్షన్ నాయకి అయిన శరణ్యే మంచి ఛాయిస్ అని ప్రొడ్యూసర్లు ఫిక్స్ అయ్యారట. అలా... మన కేరళ కుట్టి... బాలీవుడ్ లో హీరోయిన్ అయిపోతోంది. ఎనీ వేస్ ఆల్ ది బెస్ట్ శరణ్య…!

google-ad-img
    Related Sigment News
    • Loading...