జీతాలు పెరగబోతున్నాయ్!

posted on: Dec 13, 2015 9:01PM

 

గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు నిరంతరం పెరుగుతూనే వుంటాయి. మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని పలు సర్వే సంస్థలు ఇస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెరిగే అవకాశం వుందని సదరు సంస్థలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో సగటున 10 నుంచి 30 శాతం వరకు జీతాలు పెరిగే ఛాన్సుందని సర్వేల సారాంశం. ప్రైవేటు ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏడో వేతన సంఘం సూచించడంతోపాటు ఈ కామర్స్, మేక్ ఇన్ ఇండియా అంశాలు జీతాల పెరుగులకు కారణం కానున్నాయని సదరు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొత్తవారిని చేర్చుకునే అంశం 2015 సంవత్సరంలో 10 శాతం పెరిగిందని, వచ్చే ఏడాది ఈ శాతం మరింత పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు. అత్యుత్తమ పనితీరును ప్రదర్శించేవారికి గరిష్టంగా 30 శాతం వేతనాలు పెరిగే అవకాశం వుందట.

google-ad-img
    Related Sigment News
    • Loading...