రంజీల్లో గెలిచిన సచిన్
posted on: Oct 30, 2013 3:59PM
.jpg)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్ లో అజేయంగా 79 పరుగులు చేసి ముంబై జట్టును గెలిపించాడు. హర్యానా జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీరి మ్యాచులో ముంబై జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు మంగళవారం ఆటముగిసే సమయానికి ఆరు వికెట్లకు 201 రన్స్ చేసి విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. రహానె (40), కౌస్తుబ్ పవార్ (47) రాణించారు. మిగిలిన 39 పరుగులను బుధవారం ముంబై జట్టు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచులో తన అనుభవాన్ని జోడించి తనదైన శైలిలో ఆడడం ద్వారా ముంబైకి సచిన్ ఈ విజయాన్ని అందించాడు.



.jpg)



