సచిన్ 74 ఔట్

 

 

 

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్ చివరి మ్యాచ్‌లో 74 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. శుక్రవారం ఉదయం జోరుతో ఆట ప్రారంభించిన సచిన్ 112 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సచిన్ ఆట తీరు చూసేందుకు యూపీఏ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, నటులు అమీర్‌ఖాన్, హృతిక్ రోషన్, వెంకటేష్ పలువురు ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చారు. సచిన్ పెవిలియన్ వెళ్లే సమయంలో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. ఈ క్రమంలో సచిన్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆధిక్యంలో ఉంది.