యూపీఏ సర్కార్ పారిపోయింది: సబ్బం హరి

 

 

 

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా యూపీఏ ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. అవిశ్వాసానికి అవసరమయిన మద్దతు లభించిందని, దీంతో కాంగ్రెస్ పార్టీ చర్చ రానివ్వకుండా చేసిందని, స్పీకర్ మీరాకుమారి సభను వాయిదా వేసిందని అన్నారు. అంతే కాకుండా అవిశ్వా తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రొరోగ్ చేయాలనుకుంటున్నట్లు సబ్బం హరి ఆరోపించారు. తమను సస్పెండ్ చేసినా వెనక్కు తగ్గేది లేదని, తాము ఎవరికీ అమ్ముడు పోలేదని, ప్రజల కొరకే తాము ఈ పని చేస్తున్నామని అన్నారు.