Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నౌక మునిగి 54 మంది జల సమాధి
posted on: Apr 2, 2015 10:22AM

రష్యాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకొంది. 54 మంది ఒక్కసారిగా జలసమాధి అయ్యారు. సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం దక్షిణ మగదాన్ కు 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న కామ్ చట్కా తీరంలో ది దాల్సి వోస్తోక్ అనే నౌకలో మొత్తం 132 మంది ప్రయాణిస్తున్నారు. ఈ నౌక ఒక్కసారిగా మంచు గడ్లలను ఢీ కొట్టడంతో మునిగిపోయి అధిక ప్రాణనష్టం జరిగింది. సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని 63 మందిని కాపాడగా 54 మంది జలసమాధయ్యారు. మరో 15 మంది గల్లంతయ్యారు. ఈ నౌకలో ప్రయాణించే ప్రయాణికుల్లో 78 మంది రష్యన్ లుకాగా 40 మంది మయన్మార్, ఉక్రెయిన్, లిథువానియా, వాంచూ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు రష్యా ప్రభుత్వ అధికారులు తెలిపారు.


.png)



