44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీ కంటె 1 ఎక్కువే
Published on: Wed May 13, 2015 6:30PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు ముగిశాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్ కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్ మెంట్ పెంచమని అడుగగా కేసీఆర్ ఒక శాతం ఎక్కువే అంటే 44 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముఖ్యమంత్రి ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సమ్మె కథ సుఖాంతం అయింది.


