43 శాతం ఫిట్మెంట్ కు ఓకే.. ఏపీ సర్కార్

posted on: May 13, 2015 3:13PM

 

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సమస్య పరిష్కారం ఓ కొలిక్కి వచ్చింది. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేసిన 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తమకు ఉన్న బకాయిలు కూడా చెల్లించాలని ఆర్టీసీ కార్మికులు కోరగా.. ఇప్పటినుండి అవి లేకుండా ఇస్తామని, చెల్లింపు కుదరదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. ప్రస్తుతం ఫిట్మెంట్ మాత్రమే ఇస్తే ఏపీ ప్రభుత్వం పై రూ. 900 కోట్ల భారం పడుతుందని, ఒకవేళ పాత బకాయిలు చెల్లించాల్సి వస్తే మరో 1108 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. సమస్య పరిష్కారం అవడంతో కొంతసేపట్లోన్ ఆర్టీసీ సమ్మె కూడా విరమించే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...