TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రి

Published on: Thu May 21, 2015 2:30PM

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల కారణంగానే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఆస్తుల పంపిణీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. మే 28 నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్న విషయం తెలిసిందే.