గురుకులాల్లో కుట్రలు జరగడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కారణం

posted on: Nov 29, 2024 5:26PM

తెలంగాణలో   కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత  సంక్షేమ హాస్టల్ లో   ఓ విద్యార్థి చనిపోతే బీఆర్ఎస్ నేత  ఆర్ ఎస్ ప్రవీణ్ రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండాసురేఖ ఆరోపించారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో  సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా అనేక చర్యలు తీసుకుందని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురు కులాల కార్యదర్శిగా పని చేసినప్పుడు అన్నంలో పురుగులు వచ్చాయని కొండా సురేఖ గుర్తు చేశారు. గురు కులాల్లో కుట్రలు చేస్తున్న బిఆర్ఎస్ నేతలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పగలరన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...