Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టైరు బరస్టై కారు బోల్తా.. నలుగురు మృతి
posted on: Aug 10, 2022 10:03AM
మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తుంటే అది నిజమేనని నమ్మక తప్పదు.
కారు టైరు బరస్ట్ కావడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముస్కాల్ బైపాల్ కొత్తపల్లి వద్దకు రాగానే కారుటైర్ బరస్ట్ అయ్యింది.
దీంతో అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలోమరణించిన వారిలో ఇద్దరుచిన్నారులు కూడా ఉన్నారు. ఈసంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన వారుగా గుర్తించారు.






