Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి
posted on: Mar 4, 2026 11:35AM
.webp)
చిత్తూరు జిల్లాలో బుధవారం (మార్చి 4) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు ముందు వెడుతున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ అతి వేగంగా కారు నడుపుతూ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలూ ఉన్నారు. మృతులంతా కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






