Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేటి నుండి గోదావరి నిత్య హారతి
posted on: Jul 1, 2015 8:54PM
.jpg)
కాశీ పుణ్యక్షేత్రంలో రోజూ సాయంత్రం జరిగే గంగా (నది) హారతిని చూసి తరించేందుకు దేశంలో నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఆ ప్రేరణతోనే ఆంధ్రులకు పరమ పవిత్రమయిన గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, మంత్రులు దేవేనేని ఉమామహేశ్వర రావు, పి. సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్. కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, రాజమండ్రి యం.పి. మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



.jpg)


