రూపాయి పాపం ప్రభుత్వానిదే
posted on: Aug 30, 2013 9:49AM

మరో 15 రోజుల్లో పదవి విరమణ చేయనున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనంతో పాటు ప్రస్థుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోబానికి ప్రభుత్వం ఆర్ధిక మంత్రి చిదంబరమే కారణం అన్నారు.
దేశం ప్రగతిని తాకట్టు పెట్టినమరి తమ స్వలాభాల కోసం కేంద్రం పాకులాడుతుందని ఘూటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటన వల్ల రూపాయి కుప్పకూలిందనడం సరికాదన్నారు. దేశీయంగా సరైన చర్యలు లేఖపోవటం, ప్రణాలికా బద్దంగా ఆర్ధిక శాక వ్యవహరించకపోవటం అందుకు కారణం అన్నారు.







