Latest News
సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ అయిన రేవంత్ రెడ్డి
posted on: Jan 17, 2025 12:38PM
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశ విదేశాంగమంత్రి బాలకృష్ణన్ తో శుక్రవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. గురువారం పొద్దుపోయే వరకు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపిన రేవంత్ రెడ్డి రాత్రి సింగపూర్ కు బయలు దేరారు. సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ది కార్యక్రమాలను అధికారులు పోల్చి చూసుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో సింగపూర్ లో రాష్ట్ర బృందం పర్యటించనుంది. సోమవారం ఇదే బృందం దావోస్ పర్యటించనుంది.



.webp)


