రేవంత్ రెడ్డి చంచల్ గూడ టు చర్లపల్లి

రేవంత్ రెడ్డికి 14 రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే చంచల్ గూడ జైలు అధికారులు చంచల్ గూడలో తీవ్రవాదులున్నారని, సరిపడా బ్యారక్ లు లేవని ఈ సమయంలో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడం కష్టమని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, జైలులో తనకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు తెదేపా నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిని కలిసి పరామర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu