రేవంత్ రిమాండ్ పొడిగింపు

ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రిమాండ్ ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. అయితే విచారణ కీలక దశలో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టులో మరో మెమో దాఖలు చేసింది. అయితే ఏసీబీ అధికారులు విజ్ఞప్తి మేరకు కోర్టు రేవంత్ రెడ్డి రిమాండ్ ను 14 రోజులు అంటే వచ్చే నెల 13 వరకు పొడిగించింది.