ఇక్కడ మొట్టికాయ పడింది.. అక్కడ కూడా పడాలా?

ఇప్పటికే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. ఇక్కడ తిన్న మొట్టికాయలు చాలవేమో మళ్లీ సుప్రీంకోర్టులో కూడా తింటే కాని వాళ్లకి నిద్రపట్టేట్టు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది తెలంగాణ ఏసీబీ. రేవంత్ రెడ్డికి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ లకు కోర్టు బెయిల్ ఇచ్చిందని.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలంగాణ న్యాయవాదులు కూడా ఆరాటపడుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత సమీక్ష జరిపి ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తామని అంటున్నారు.