TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

Published on: Tue Jun 30, 2015 11:22AM

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజుకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుంచో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా?అనే అనుమానాలకు ఈ రోజు తెరపడింది. నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. దీంతో తెదేపా నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా తెలంగాణ ఏసీబీ అధికారులు చాలా గట్టి ప్రయత్నమే చేశారు. కేసు కీలక దశలో ఉందని.. సాక్ష్యాలు తారు మారు చేస్తారని పలు కుంటి సాకులు చెప్పింది. కానీ కోర్టు మాత్రం వాటిని ఖండించి రేవంత్ రెడ్డికి రేవంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.