Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేటితో ముగిసిన రేవంత్ కస్టడీ...
posted on: Jun 29, 2015 10:41AM

నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా లకు కూడా ఈ రోజుతో కస్టడీ ముగియడంతో ఏసీబీ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసిన పిల్ పై తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి బెయిల్ విచారణ మంగళవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా?రాదా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


.jpg)
.jpg)


