నేటితో ముగిసిన రేవంత్ కస్టడీ...

నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా లకు కూడా ఈ రోజుతో కస్టడీ ముగియడంతో ఏసీబీ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసిన పిల్ పై తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి బెయిల్ విచారణ మంగళవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా?రాదా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.