రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుంది

 

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని వుందని తమకు అనుమానాలు వున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలమీద రేవంత్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని వస్తున్న వార్తల మీద వారు స్పందించారు. దీనిమీద తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే బయటకు తీసుకురావాలని కోరారు. అధికారం వుంది కదా అని ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్ష తీర్చుకుంటున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటన మీద వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu