ఏసీబీ అదుపులో రేవంత్ రెడ్డి?

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేని ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి అరెస్టు కాలేదని చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో రేవంత్ రెడ్డి బేరం ఆడారని ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అరెస్టుతోపాటు 50 లక్షల డబ్బును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తన దగ్గర ఎలాంటి డబ్బు లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.