హరీష్‌రావు విగ్రహం పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి

posted on: Jul 10, 2015 5:38PM

 

ఓటు నోటు కేసులో జైలు నుండి విడుదలైన తరువాత తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ మైకు పట్టారు. తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షనేతలకు ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి హరీష్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఎక్కడైనా పాలమూరు ఎత్తిపోతలపై చర్చ ఉందా? జూన్‌ 18న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అయినా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంటే ఒక్క పాలమూరు జిల్లా బంద్‌కే ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు అనుమతి కోసం హరీష్‌రావు బలిదానం చేస్తే ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం బంద్‌లు కాదు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...