రేవంత్ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు
Published on: Tue Jun 30, 2015 10:10AM
.jpg)
ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి తతరులకు ఇప్పటికి రెండు సార్లు కస్టడీ పొడిగించిన ఎసిబి కోర్టు మళ్ళీ నిన్న మరో రెండు వారాల వరకు అంటే వచ్చే నెల 13వరకు కస్టడీ పొడిగించింది. ఎసిబి కోర్టు బెయిలు మంజూరు చేసేందుకు తిరస్కరించడంతో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా ముగ్గురు కొన్ని రోజుల క్రితం హైకోర్టులో బెయిలు కోసం పిటిషను వేసారు. దాని విచారించిన హైకోర్టు ఈరోజు తన తీర్పును ప్రకటించే అవకాశం ఉంది.


