Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ బెయిల్ విచారణ వాయిదా..
posted on: Jun 24, 2015 2:06PM

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై వాదనలు వినిపించడానికి ఇంకా కొంత సమయం కావాలని.. మావద్ద కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అదనపు కౌంటర్ దాఖలు చేయాలని.. దానికి కొంత గడువుకావాలని ఏసీబీ కోరింది. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో వీడియో టేపులు ఇప్పటికే టెస్టు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన నివేదిక కూడా ఈ రోజే రానుంది. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య అరెస్ట్ పై స్టే కూడా ఈ రోజే ముగియనుంది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా బెయిల్ కోసం హోకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


.jpg)



