స్టీఫెన్ సన్ వాంగూల్మం.. ఏసీబీ దూకుడు

posted on: Jun 13, 2015 3:20PM

నోటుకు ఓటు కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు, ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. వాటికి సంబంధించిన నివేదిక కూడా రెండు మూడు రోజుల్లో రానుంది. మరోవైపు ఈ కేసులో తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది. స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగూల్మం బట్టి ఏసీబీ బరిలో దిగనుంది. అతను ఏ పేర్లు చెపుతాడో దాని బట్టి వారికి నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉంది ఏసీబీ. విచారణలో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలనుండి సేకరించిన సమాచారాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీనిలో కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...