Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్టీఫెన్ సన్ వాంగూల్మం.. ఏసీబీ దూకుడు
posted on: Jun 13, 2015 3:20PM

నోటుకు ఓటు కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు, ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. వాటికి సంబంధించిన నివేదిక కూడా రెండు మూడు రోజుల్లో రానుంది. మరోవైపు ఈ కేసులో తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది. స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగూల్మం బట్టి ఏసీబీ బరిలో దిగనుంది. అతను ఏ పేర్లు చెపుతాడో దాని బట్టి వారికి నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉంది ఏసీబీ. విచారణలో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలనుండి సేకరించిన సమాచారాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీనిలో కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.






