Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ కేసు.. ఎంపీ ఖాతా నుండి డబ్బు డ్రా?
posted on: Jun 12, 2015 12:29PM

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తెచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలుసుకునే పనిలో పడింది ఏసీబీ. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తీసుకొచ్చిన డబ్బు నోట్లపై బ్యాంకు లేబుల్స్ లేకపోవడంతో నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఆ డబ్బు ఓ చిన్న బ్యాంకు ద్వారా డ్రా చేశారన్న విషయం తెలుసుకున్నారు. అయితే ఆడబ్బు చంద్రబాబుకు అతి సన్నిహితుడైన ఓ ఎంపీ ఖాతా నుండి డ్రా చేసినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 4.5 కోట్ల డబ్బుల గురించి దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడేటప్పుడు బాస్ అని అన్న నేపథ్యంలో అసలు ఆ బాస్ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు గట్టి ప్రయత్న చేస్తుంది ఏసీబీ. దీనికి సంబంధించి రేవంత్ కస్టడీలో ఉన్నప్పుడు విచారించగా రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఏసీబీ రేవంత్ గతంలో మాట్లాడిన వీడియోలు ఏ ఏ సందర్భాలలో బాస్ అని మాట్లాడాడు.. ఎవరిని ఉద్దేశించి బాస్ అనే పదం ఉపయోగించాడో తెలుసుకునే పనిలో పడింది. మొదటి దర్యాప్తులో చేపట్టిన సమాచారంతో చంద్రబాబుకు, ఇతర మంత్రులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు చేస్తోంది.






