నాపై కుట్ర జరిగింది: రేవంత్ రెడ్డి

 

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ అనే ఎమ్మెల్యేకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనమీద కుట్ర పన్ని ఈ కేసులో తనను ఇరికించారని చెప్పినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తనపై జరుగుతున్న కుట్రలను, చేస్తున్న వత్తిడులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నట్టు తెలుస్తోంది.