నాపై కుట్ర జరిగింది: రేవంత్ రెడ్డి

 

తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ అనే ఎమ్మెల్యేకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనమీద కుట్ర పన్ని ఈ కేసులో తనను ఇరికించారని చెప్పినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తనపై జరుగుతున్న కుట్రలను, చేస్తున్న వత్తిడులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu