Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తుదిశ్వాస విడిచిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధర్మారావు
posted on: Mar 20, 2013 9:10AM
.png)
గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తెలుగు అకాడమీ మాజీ చైర్మన్, భాషోద్యమ నేత, కాలమిస్టు చలమాల ధర్మారావు (79) మంగళవారం తెల్లవారుఝామున 12.50నిముషాలకు హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో గుడిస్వాష విడిచారు. 1934 మార్చి 30వ తేదీన కృష్ణాజిల్లా పెద్ద అవుటపల్లిలో సీతారత్నమ్మ, నాగభూషణం దంపతులకు జన్మించిన ఆయన ఉస్మానియాలో పిజి చేసి కర్నూలు సచివాలయంలో, తరువాత హైదరాబాద్ సచివాలయంలో పలుశాఖలలో విధులు నిర్వర్తించారు. గోరాశాస్త్రి శిష్యునిగా ప్రసిద్దుడైన చలమాల ధర్మారావు నాలుగేళ్ల పాటు అధికార భాషాసంఘం కార్యదర్శిగా, ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సి.ధర్మారావుగారు 'రవ్వలు-పువ్వులు;, 'ప్రేమిచుకుందాం రండి' వంటి గ్రంథాలను రచించారు. పలు ప్రముఖ దినపత్రికలకు కాలమ్స్ అందించారు. ధర్మారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. బుధవారం ఉండిం అంబర్ పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారులు శ్రీనివాస్, రామ్మోహన్ తెలిపారు.


.png)
.png)


