రేణుకా చౌదరి అనుచరులకు చెప్పుదెబ్బలు

 

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరుల మీద చెప్పుదెబ్బ పడింది. ఇటీవల రేణుకా చౌదరి మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ జీ అనే కాంగ్రెస్ నాయకుడు ఇటీవల మరణించాడు. ఆయనకు గత ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పిస్తానని రేణుకా చౌదరి కోటి పది లక్షలు వసూలు చేశారని రామ్ జీ భార్య లీల ఆరోపించారు.ఈ మేరకు ఆమె రేణుకా చౌదరి మీద ఆమె కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఖమ్మంలో రేణుకా చౌదరి అనుచరులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లీల వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు, రేణుకా చౌదరి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో లీల రేణుకా చౌదరి అనుచరులను చెప్పుతో కొట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News