అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదురోజులు

posted on: Sep 16, 2012 8:15PM

Assembly, mansoon session, kiran kumar reddy, chandrababu, fee reimbursement, trs, separate telangana, opposition parties, farmers, power cut

సోమవారంనుంచి శనివారం వరకూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి సందర్భంగా బుధవారం రోజున మాత్రం సెలవు దినంగా ప్రకటించారు. వర్షాకాల సమావేశాల పనిదినాల్ని తగ్గించినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంనుంచి వాకౌట్ చేసింది. ఈ సమావేశాల్లోనైనా తెలంగాణపై సభలో ప్రత్యేక తీర్మానం చేయాలని టిఆర్ ఎస్ సభ్యులు గట్టిగా పట్టుబడుతున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజులు, కరెంట్, రైతుల సమస్యలు, కరువు లాంటి అంశాలమీద ఈ ఐదురోజుల్లో సభలో చర్చ జరగబోతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...