రెడ్‌ శాండిల్‌ స్మగ్లింగ్‌ హబ్‌గా మారిన నెల్లూరుజిల్లా!

posted on: Aug 21, 2012 8:48AM

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాల ఎర్రచందనం స్మగ్లింగు ముఠాలూ సరుకును నెల్లూరు జిల్లా మీదుగా తరలిస్తున్నాయి. నెల్లూరు జిల్లా తడ, కర్నూలు జిల్లా నుంచి ఆత్మకూరు మీదుగా ఈ స్మగ్లింగు కార్యకలాపాలు సాగుతున్నాయి. అలానే చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు మీదుగా ఈ స్మగ్లింగు సాగుతోంది. నెల్లూరు జిల్లా ఈ స్మగ్లింగుకార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని అటవీ శాఖాథికారులు గుర్తించారు. ఇక్కడ మంచికాపలా పెడితే స్మగ్లింగుకార్యకలాపాలను అదుపు చేయగలుగుతామని కూడా గుర్తించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా అటవీశాఖాధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఆత్మకూరు మండలం వెల్లూరిపాలెం చెక్‌పోస్టు వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. మొత్తం 36 ఎర్రచందనం దుంగలను ఈ దాడిలో అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగులక్షల రూపాయల విలువైన ఎర్రచందనం అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలానే లక్షలు, కోట్లాది రూపాయల విలువైన సరుకు త్వరలో స్వాధీనం చేసుకోగలుగుతామని అటవీశాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కేంద్రం సాగే ఈ రవాణాను అడ్డుకోవటానికి తమవంతు కృషి చేస్తామంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...