Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సబ్ ముసల్మానోంకో ఈద్ ముబారక్
posted on: Aug 19, 2012 12:21PM
రంజాన్ నెల ముస్లింలకు అత్యంత ప్రీతి పాతమైన నెల. ఈనెల లోనే ముస్లింలకు మతగ్రంధమైన ఖురాన్ ఉద్బవించిందని చెబుతారు. మొదట ఆరునెలలు ఈ ఉపవాసదీక్షను ముస్లింలందరూ అమలుచేయవలసి ఉండేది. అయితే దైవ ప్రవక్త మహ్మద్ ఈ ఆరునెలలను ఒక నెలగా తగ్గించాల్సిందిగా అల్లాప్ాని ప్రార్దించారు.అప్పటినుండి ఒక నెలకు కుదించబడిరదని ముస్లింలు నమ్ముతారు. రంజాన్ నెలను సహోదరప్రేమ, ప్రార్దన, తోటివారిని ప్రేమించేందుకు గుర్తుగా భావిస్తారు.
పేద గొప్ప తారతమ్యం లేకుండా మానవులంతా సమానులే అని చాటిచెపటానికే ఈ మాసం ఆవిర్బవించిందని చెబుతారు.శాంతి, సహజీవనంను పాటించడానికే రంజాన్ మాసం ఉపయోగపడుతుందని ముస్లింల నమ్మకం. ఉపవాసలద్వారా, ప్రార్ధన చేస్తూ, సహోదర ప్రేమకలిగి పేద,గొప్ప తేడాలేకుండా కలసి జీవిచడం వల్ల శత్రుభావం కొరవడుతుందని నమ్ముతారు. ప్రేమ ఆప్యాయతలు లోపించటం,ఎవరి స్వార్ధం వారే చూచుకుంటూ గొప్పవాళ్లు మరింత గొప్పవాళ్లుగా పేదలు మరింత పేదరికానికి దిగజారిపోవడం అల్లాప్ాకు ఇష్టం లేదని రంజాన్ నెల చాటి చెబుతుంది.
కక్ష్యలు కార్పణ్యాలతో అల్లర్లు సృష్టించడం ముస్లిం తత్వానికి వ్యతిరేకం. ఉపవాసం వల్ల పేదవారి ఆకలి బాధలు తెలుసుకుంటానికి, ఇఫ్తార్ పేదలతో కలసి భుజించడానికి మాత్రమే ఏర్పాటు చేయబడిరది. అలాగే దేవుడు మానవులకిచ్చిన ప్రతి చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపటం ముస్లిం జీవితంలో చాలా ముఖ్యం. ప్రతిరోజూ సాయంత్రం మస్జిద్లో ప్రార్దనలు జరిపిన తర్వాత దేవుని సమక్షంలో పేద ముస్లింలతో తినటం ఆశీర్వాదంగా భావిస్తారు. అదే సమయంలో అబద్దాలు చెప్పటం, బూతులు మాట్లాడటం, చెడ్డదృష్యాలు చూడటం, చెడ్డతలంపులను కలిగివుండటం, పుకార్లను వ్యాపింప చేయటం పాపంగా భావిస్తారు.
ఈ పవిత్రమాసం లో ముస్లింలు మక్కా మస్జిద్ను దర్శించడాని ఇష్టపడతారు. మక్కా సౌదీ అరేబియాలో ఉంది. ఇది ప్రపంచంలోని ముస్లింలకందరికి పవిత్ర ప్రదేశంమైన కాబాలో ఉంటుంది. దీని వైశాల్యం 3,841,000 చతురపు అడుగులు. దీని లోపల బయట కలిపి 820,000 ముస్లింలు ప్రార్ధించే వీలుంటుంది. ఈ ప్రార్దనలనే హాజ్ అంటారు. ఈ పవిత్ర దినాల్లో సుమారు 2 కోట్ల మంది ముస్లింలు ప్రపంచం నలుమూలలనుండి దీన్ని దర్శించి ప్రార్దిస్దారు. వెళ్లలేని ప్రతి ముస్లిం దీని దిక్కుగా నిలుచుని ప్రార్ధనలు జరుపుతారు. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖుఱ్ఆన్ లేఖనముల ప్రకారం దేవుని అత్యంత ఇష్టుడైన ఇబ్రహీం దీన్ని నిర్మించారని తెలుస్తుంది. ఈ రంజాన్ పండుగ ప్రార్ధనలద్వారా దేశం శాంతి, సౌభాగ్య, సౌభ్రాతృత్యాలను పండిరచగలదని ఆశిద్దాం...



.png)


