గోదావరికి వరద ఉదృతితో పొంచి ఉన్న ప్రమాదం

posted on: Aug 9, 2012 11:33AM

గోదావరికి ఎగువనుండి వరద ఉదృతి పెరగటంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి లోని రామచంద్రా పురం మండలంలోని పేరిలంక గ్రామ ప్రజలను అధికారులు ఖాళీచేయించి సురక్షక ప్రాంతాలకు తరలించారు. పేరిలంకకు సమీపంలో ఉన్న గ్రామాలను కూడా ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతల్లోని కరకట్ల రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దవళేశ్వరం బ్యారేజిలోని అన్ని గేట్లను ఎత్తివేశారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు చెబుతున్నారు. చేపల వేటను నిషేదించారు. గోదావరి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...