సఫలమైన మనగుడి కార్యక్రమం

posted on: Aug 1, 2012 10:13AM

దేవాదాయశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన గుడి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని గుడులలోనూ ఇది ప్రవేశ పెట్టడం హర్షణీయమని ఆత్యాధ్మిక సంఘాలు కొనియాడుతున్నాయి. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో భక్తి భావం పెల్లుబుకుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలోభాగంగా ప్రచార రధంలో దేవుని ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవంగా అలంకరించి గ్రామగ్రామాన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ఈ ప్రచార రధం వెళ్లడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఆయా స్వామివారి, అమ్మవార్ల విశిష్టతను ప్రజలకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమం వల్ల హిందూమత ఆచారసాంప్రదాయాలను ,భక్తి భావాలను పెంచటమే కాక హిందూ మత విశిష్టతను కూడా పెంపొందించుకోవచ్చని ఆత్యాధ్మిక సంఘాలు కొనియాడుతున్నారు. దీనిలో భాగంగానే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్ధానం నుండి ప్రచారరధం శంఖవరం, రౌతులపూడి, తేటగుంట మీదుగా తుని చేరుకుంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...