Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్ట్ అనుమతి
posted on: Jul 6, 2012 4:32PM
అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్రెడ్డిని విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అనుమతి లభించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ హోదాలో జగన్ను ఈడీ ప్రశ్నించనుంది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విచారించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్ను ఈడీ ప్రశ్నించనుంది. మొదటగా దాఖలైన మూడు చార్జీషీట్లకు సంబంధించి జగన్ను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగతి పబ్లికేషన్లో పెట్టిన పెట్టుబడులు, మనీ లాండరింగ్కు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.






