Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాయల తెలంగాణ మాకు వద్దు: ప్రొఫెసర్ కోదండరామ్
posted on: Jun 28, 2012 3:58PM
రాయల తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారమిక్కడ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాయల తెంలంగాణ ప్రతిపాదన తెచ్చినవారంతా తెలంగాణద్రోహులేనన్నారు. రాయల తెలంగాణకు నిరసనగా జిల్లాల్లో కాంగ్రెసు నాయకుల దిష్టిబొమ్మలు దగ్ఘం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీమ నాయకులతో కాంగ్రెసు శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి కుమ్మక్కై రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే నెల 7వ తేదీన జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసినవారిని ద్రోహులుగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.






